అలనాటి తారలలో అగ్రతారగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి వంటి స్టార్ హీరోలందరి సరసన నటించారు.
అయితే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తిరిగి అలా వైకుంఠపురం సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.
ఈమె కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్ర హీరోల సరసన నటించి మూడు ఇండస్ట్రీలలో అగ్రతారగా కొనసాగారు.
ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ చిత్రాలలో తక్కువగా నటిస్తున్నప్పటికీ హిందీలో మాత్రం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు బాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు హీరో అజయ్ దేవగన్, దర్శకుడు విశాల్ భరద్వాజ్ నాకు రక్షణ కవచం లాంటి వాళ్ళు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.నాకు చాలా సంవత్సరాలుగా వీరిద్దరితో మంచి అనుబంధం ఉందని నాలో మంచిచెడుల గురించి వీరిద్దరికీ మాత్రమే తెలుసు అని ఈమె వెల్లడించారు.గత 13 సంవత్సరాల నుంచి మా మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని టబు హీరో అజయ్ దేవగన్, డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.