సినిమాకు సంబంధించిన లావాదేవీల వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.జ్యోస్టార్ ఎంటర్టైన్మెంట్స్ కు చెందిన కోటేశ్వర రాజు జీవిత రాజశేఖర్ దంపతులు తమ నుంచి అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే నిర్మాతలు కోటేశ్వర రాజు,హేమ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీవిత రాజశేఖర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ లో జీవిత రాజశేఖర్ ఆరోపణలపై స్పందిచగా.
వ్యాఖ్యలపై హేమ స్పందిస్తూ ఆమె ఒక సైలెంట్ కిల్లర్ అని ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తున్నారని కోటేశ్వరరాజు -హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జీవిత రాజశేఖర్ ఒక మహానటి అని, ఆమె చంపేస్తామని బెదిరించారని, అంతే కాకుండా ప్రజలను అబద్ధాలతో పెద్ద పెద్ద మనుషుల పేర్లతో మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అయితే మొదట్లో తాము ఎవరో కూడా తెలీదన్నారు.కానీ నిన్న మా గురించి లిమిట్స్ క్రాస్ చేసి మరి మాట్లాడారని హేమ ఆరోపించారు.
మేము పరువు ప్రతిష్టలు గల కుటుంబం నుంచి వచ్చాము.మా ఆయన కోటేశ్వరరాజు యూఎస్ లో అవార్డు గ్రహీత.
నేను యూకేలో హైలీ పెయిడ్ ప్రొఫెసర్ గా చేసాను.
జీవితా రాజశేఖర్ కోర్టు కేసులో నుంచి బయపడినట్లు మాట్లాడుతున్నారు అని హేమ వ్యాఖ్యానించారు.జీవిత రాజశేఖర్ నోరు అదుపులో పెట్టుకో.సెలబ్రిటీలకు ఒక లైఫ్.
సామాన్యులకు ఒక లైఫ్ ఉంటుందా? సెలబ్రిటీ పేరుతో మోసాలు చేస్తోంది.జీవిత రాజశేఖర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది అంటూ మండిపడింది హేమ.
అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ.జీవితా రాజశేఖర్ 420 వేషాల గురించే తాము మాట్లాడుతున్నామని.
కానీ వారు ప్రొడ్యూసర్ లు అందరిని అవమానించే రీతిలో మాట్లాడుతున్నారని కోటేశ్వరరాజు అన్నారు.అంతే కాకుండా సింపతీ కోసం జీవితా ఏదేదో చెబుతోందని.
తమ బాధని చెప్పుకోడానికి మీడియా ముందుకు వస్తే పబ్లిసిటీ కోసం వచ్చామని జీవితా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.