ఎవరి పిచ్చి వారికానందం అన్నట్టు వుంది వీరి నిర్వాకం.ప్రపంచంలో విభిన్న రుచులు.
అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్ని ఆహారపదార్ధాలను కలిపేసి తినేయమంటాడు హీరోని.దాంతో హీరో అవాక్కయి, బ్రహ్మానందానికి ఒక్కటిస్తాడు.
అయితే అది సినిమా.కానీ నిజ జీవితంలో అలాంటివారు లేకపోలేదు.
మనలో కొంతమంది రెండు మూడు కూరలను మిక్స్ చేసి తినేస్తూ వుంటారు.అది వారికి రుచికరంగా ఉన్నప్పటికీ చూసేవారికి మాత్రం ఒకింత అసహ్యంగా ఉంటుంది.
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్టు ఎవరి టెస్టులు వారిని అన్న మాదిరి కొంతమంది ప్రవర్తిస్తుంటారు.తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా పుణ్యామాని ఇలాంటివి చూడాల్సి వస్తోంది.వంటకాలను మామ్మూలుగా చేస్తే ఎవరు చూస్తారు అనుకుంటున్నారో ఏమో కానీ, కాస్త పైత్యాన్ని జోడించి కొంతమంది ఇరగదీస్తున్నారు.
రుచి మాట దేవుడెరుగు? కానీ సదరు వీడియోలకు మంచి లైక్స్, షేర్ లు లభిస్తున్నాయి.కొంతమంది ఊహకు కూడా అందని కాంబినేషన్స్తో వంటలు చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.మొన్న మ్యాంగో మ్యాగీ అయితే నేడు పేస్ట్రీ మ్యాగీ వైరల్ అవుతోంది.
పేస్ట్రీతో మ్యాగీని తయారు చేశాడు ఓ నెటిజన్.దీనిని వీడియోగా తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశాడు.
దీనికోసం ముందుగా ఓ ప్యాన్ను స్టౌవ్పై ఉంచి, ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేశారు.అవి కాస్త ఏగాక, ఓ పేస్ట్రీని ప్యాన్లో వేసి అందులో నీరు పోశారు.పేస్ట్రీ మొత్తం నీళ్లలా మారిన తర్వాత అందులో మ్యాగీతో పాటు, మసాలా వేశారు.చివరిగా పేస్ట్రీ మ్యాగీని సర్వ్ చేశారు.ఈ పేస్ట్రీ మ్యాగీ రుచి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే విచిత్రంగా ఉంది కదూ! వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇలాగే స్పందిస్తున్నారు.నెట్టింట తెగ చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోపై మీరూ చూసేసి మీమీ అభిప్రాయాలు తెలియజేయండి మరి!
.