యాదాద్రి భువనగిరి జిల్లా:గౌరాయపల్లి రెవెన్యూ పరిధిలో ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేట్ మాఫియా పూర్తిగా బరితెగించిందని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంపై ఆయన బుధవారం జిల్లా డిప్యూటీ కలెక్టర్ మరియు మండల తహశీల్దార్ కు చరవాణి ధ్వారా ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారుల అండదండలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా అక్రమ మైనింగ్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్ల గొడుతున్నారన్నారు.యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,అధికారులు మరియు స్థానిక నాయకులు కుమ్మకై మైనింగ్ దందాను మూడు పువ్వులు ఆరుకాయలుగా నడిపిస్తున్నారని ఆరోపించారు.వందల లారీలతో మట్టి మైనింగ్ దందా చేస్తూ కోట్లలో దోచుకుంటున్నారని,వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.