ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేట్ మాఫియా బరితెగించింది

యాదాద్రి భువనగిరి జిల్లా:గౌరాయపల్లి రెవెన్యూ పరిధిలో ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేట్ మాఫియా పూర్తిగా బరితెగించిందని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంపై ఆయన బుధవారం జిల్లా డిప్యూటీ కలెక్టర్ మరియు మండల తహశీల్దార్ కు చరవాణి ధ్వారా ఫిర్యాదు చేశారు.

 Landmark Exterminates Real Estate Mafia-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారుల అండదండలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా అక్రమ మైనింగ్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్ల గొడుతున్నారన్నారు.యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,అధికారులు మరియు స్థానిక నాయకులు కుమ్మకై మైనింగ్ దందాను మూడు పువ్వులు ఆరుకాయలుగా నడిపిస్తున్నారని ఆరోపించారు.వందల లారీలతో మట్టి మైనింగ్ దందా చేస్తూ కోట్లలో దోచుకుంటున్నారని,వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube