సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఐదు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిందని నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.అయితే రిలీజ్ రోజే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న సర్కారు వారి పాట ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించిందంటే నమ్మలేకపోతున్నామని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మహేష్ సినిమా కలెక్షన్లు ఫేక్ అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఈ సమస్య ఇదే తొలిసారి కాదు.
గతంలో కూడా మహేష్ బాబు నటించిన పలు పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో ఈ తరహా కామెంట్లు వినిపించాయి.సాధారణంగా పెద్ద సినిమాలకు కలెక్షన్లను పెంచి చూపిస్తారని ప్రేక్షకుల్లో అపోహ ఉంది.
అయితే సర్కారు వారి పాట సినిమాకు కలెక్షన్లను మరింత ఎక్కువ చేసి చూపించారని యాంటీ ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సర్కారు వారి పాట సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఆక్యుపెన్సీకి ఆ సినిమా కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేదని నెటిజన్లు చెబుతున్నారు.
మహేష్ నటించిన గత సినిమాల విషయంలో కూడా ఈ తరహా కామెంట్లు వ్యక్తమయ్యాయి.బాక్సాఫీస్ వెబ్ సైట్ల కలెక్షన్లతో పోల్చి చూస్తే సర్కారు వారి పాట సినిమా కలెక్షన్లు 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఈ విధంగా కలెక్షన్లను పెంచి చూపించడం టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా మంచిది కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మహేష్ సినిమాలకు నిర్మాతలు మారుతున్నా కలెక్షన్లకు సంబంధించిన రచ్చ మాత్రం కొనసాగుతోంది.సర్కారు వారి పాట సెకండ్ వీకెండ్ లో సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చెప్పగలమని నెటిజన్లు, ట్రేడ్ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.