తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని జోడీ సుధీర్ మరియు రష్మీ.వీరిద్దరి మద్య ప్రేమ ఉందని ఇప్పటికి చాలా మంది నమ్ముతున్నారు.నిజానికి వారిద్దరి మద్య ఎలాంటి ప్రేమ లేదు.మంచి స్నేహం మాత్రమే ఉంది.అలాంటి వారిద్దరు కలిసి ఏ షో చేసినా కూడా సూపర్ హిట్.బ్లాక్ బస్టర్ అనే టాక్ ఉంది.
అలాంటి సుధీర్ మరియు రష్మీ జోడీ ఈ మద్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు.దాంతో వారి అభిమానులు అసంతృప్తితో ఉన్నారు.
ఇలాంటి సమయంలో సుధీర్ స్టార్ మా టీవీ లో ప్రసారం కాబోతున్న సూపర్ సింగర్స్ జూనియర్స్ కార్యక్రమంకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.ఆయనకు తోడుగా ఫీమేల్ హోస్ట్ ను పెట్టారు.
ఆ పెట్టేదేదో రష్మీ గౌతమ్ ను పెట్టేస్తే బాగుండేది కదా అంటూ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.సూపర్ సింగర్స్ జూనియర్స్ షో ను సుధీర్ తో కలిసి అనసూయ హోస్ట్ చేయబోతుంది.
వీరిద్దరు కలిసి షో ను రక్తి కట్టించేందుకు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తారనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఈ షో గురించి మరియు షో లోని హోస్ట్ ల గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.సోషల్ మీడియాలో అనసూయ కాకుండా రష్మీ ఉండాల్సిందని చాలా మంది అంటున్నారు.షో నిర్వాహకులు రష్మీ ని కాకుండా అనసూయను ఎలా పెట్టారు అంటూ వారిపై విమర్శలు చేస్తున్నారు.
మొత్తానికి అనసూయ మరియు సుడిగాలి జోడీ తో రష్మీ ఎక్కడ పోయిందంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.సుడిగాలి సుధీర్ ఇంకా రష్మీ ల జోడీతో సూపర్ సింగర్స్ జూనియర్స్ నిర్వహించి ఉంటే రెట్టింపు రేటింగ్ ను ఆ జోడీ తీసుకు వచ్చే వారు.
ఆ చిన్న లాజిక్ ను ఎలా స్టార్ మా వారు మర్చి పోయారు అంటూ సుధీర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.