యాదాద్రి భువనగిరి జిల్లా:మహాజన సోషలిస్టు పార్టీలో మహాజనులంతా భాగస్వాములై,మహాజన సోషలిస్టు పార్టీని బలోపేతం చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ (ఎం.ఎస్.
పి) రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్,ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జీ కందుకూరి సోమన్న మాదిగ పిలుపునిచ్చారు.సోమవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవన్ లో జరిగిన జిల్లాస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ నూటికి 95% పైగా జనాభా కల్గిన ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనార్టీ మరియు అగ్రకుల పేద వర్గాలుగా పిలువబడుతున్న మహాజనులంతా ఏకమై మహాజన రాజ్య నిర్మాణానికి మందకృష్ణ మాదిగ సారథ్యంలో ముందుకు సాగాలని,సామాజిక న్యాయమే ప్రాతిపదికగా ప్రజలందరికీ రాజ్యాంగ హక్కుల్ని అందించడానికి సామాజిక న్యాయం,ఆర్థిక న్యాయం,రాజకీయ న్యాయాలే మూల సూత్రాలుగా అన్నివర్గాల సంక్షేమం కోసమే మహాజన సోషలిస్టు పార్టీ ఏర్పాటు అయ్యిందని తెలిపారు.
అలాంటి మహోన్నతమైన పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామస్థాయిలో నిర్మాణానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసగించాడని మండిపడ్డారు.నియంతృత్వ నిరంకుశ పాలన చేస్తున్న కేసీఆర్ రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలని, అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు అందరూ ఏకమై మహాజన సోషలిస్టు పార్టీలో భాగస్వాములు అయ్యి ఉద్యమించాలని అన్నారు.ఎం.ఎస్.పి ని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు కమిటీల నిర్మాణాన్ని చేపట్టాలని,సభ్యత్వాల నమోదును కొనసాగిస్తూనే,ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధతకై సామాజిక న్యాయ సాధనకు త్వరలో చలో ఢిల్లీని ఉంటుందని ప్రకటించారు.పాలకులు స్పందించి వర్గీకరణ సాధనతో పాటు, అణగారిన,అగ్రకుల పేద వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.పి నేతలు నల్ల చంద్రస్వామి మాదిగ,మంద శంకర్ మాదిగ,దుబ్బ దానయ్య మాదిగ,గోసంగి పరమేష్ మాదిగ,బోయ దేవేందర్ మాదిగ,సందేల శ్రీను మాదిగ,భుడిద జానీ మాదిగ,బోయ లింగస్వామి మాదిగ,ఊదరి శ్యామ్ మాదిగ,ఎంఎస్ఎఫ్ నేతలు దుబ్బ రామకృష్ణమాదిగ, ఇటుకల దేవేందర్ మాదిగ,నల్ల బాలరాజు మాదిగ, లింగస్వామి మాదిగ,సుంకిశాల నాగరాజు మాదిగ ఉప్పగళ్ల శశిధర్ వైశ్య,సాయికుమార్ వైశ్య తదితరులు పాల్గొన్నారు.