బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కు దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉంది.79 సంవత్సరాల వయస్సులో సైతం అమితాబ్ బచ్చన్ వరుస సినిమాలలో నటిస్తూ సత్తా చాటుతున్నారు.సోషల్ మీడియాలో కూడా అమితాబ్ బచ్చన్ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో అమితాబ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఎంత గొప్ప వ్యక్తి అయినా అమితాబ్ ఇతరులను గౌరవించే విషయంలో ముందువరసలో ఉంటారు.
కథ, పాత్ర నచ్చితే అతిథి పాత్రలలో నటించడానికి కూడా అమితాబ్ బచ్చన్ ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.
బాలీవుడ్ మెగాస్టార్ గా అమితాబ్ కు పేరుప్రఖ్యాతులు ఉండగా అమితాబ్ సోషల్ మీడియా ద్వారా వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగతమైన విషయాలను సైతం పంచుకుంటారనే సంగతి తెలిసిందే.అమితాబ్ బచ్చన్ నిన్న ఉదయం 11.30 గంటల సమయంలో ఫేస్ బుక్ లో గుడ్ మార్నింగ్ అంటూ పోస్ట్ పెట్టారు.
అమితాబ్ ఆలస్యంగా గుడ్ మార్నింగ్ అని చెప్పడంతో మీరు ఎర్లీ మార్నింగ్ విష్ చేశానని భావిస్తున్నారా? అని రివర్స్ లో ప్రశ్నించారు.
నెటిజన్ కామెంట్ కు అమితాబ్ స్పందిస్తూ అర్ధరాత్రి సమయంలో షూట్ మొదలుకాగా షూట్ మార్నింగ్ వరకు సాగిందని అందువల్లే తాను ఆలస్యంగా నిద్ర లేచానని వివరణ ఇచ్చారు.మరొక నెటిజన్ “ఇది మధ్యాహ్నం ముసలోడా” అంటూ వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు.
ఆ కామెంట్ కు అమితాబ్ బచ్చన్ రియాక్ట్ అవుతూ ఈ కామెంట్ చేసిన వ్యక్తి చాలాకాలం బ్రతకాలని తాను ఆశిస్తున్నానని అయితే మిమ్మల్ని ముసలోడా అని పిలిచి అవమానించకూడదని భావిస్తున్నానని ఆయన తెలిపారు.బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నెటిజన్ కామెంట్ పై ఘాటుగా రియాక్ట్ కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.