ఖమ్మం నగరంలో ఓ యువకుడు అనుమానస్పద మృతి స్వల్ప ఉద్రిక్తత దారి తీసింది.నగరంలోని వైరా రోడ్ లో ఓ ప్రవేట్ కాలేజ్ మెస్ లో పనిచేస్తున్న గోపాలరావు గత రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు.
గోపాలరావు చింతకాని చెందిన వ్యక్తి , మూడు నెలలుగా కాలేజీలో మెస్ లో పనిచేస్తున్నాడని బంధువులు తెలిపారు.కాగా మెస్ లో పనిచేసే తోటి సిబ్బందే గోపాలరావు ను కొట్టి చంపి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అబద్ధాలు చెబుతున్నారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.