త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సముద్రఖని గురించి అందరికీ సుపరిచితమే.ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఈయన అనంతరం రవితేజ నటించిన క్రాక్ సినిమా ద్వార మరింత గుర్తింపు పొందారు.
ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయనకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమాలో ఏకంగా మహేష్ బాబు సముద్రఖనిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న అనంతరం సముద్రకని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో స్వయంగా హీరో మహేష్ బాబు తనకు డైరెక్టర్ తో చెప్పి అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది.
ఒకపెద్ద హీరో నోటివెంట నా పేరు రావడం నిజంగా నా అదృష్టం అంటూ ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇక పోతే తాను మహేష్ బాబుతో సినిమా చేయక పోయినప్పటికీ తనకు మహేష్ బాబు సినిమాలంటే చాలా ఇష్టమని ఆయన నటించిన మురారి, మహర్షి, భరత్ అనే నేను సినిమాలు అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా సముద్రఖని వెల్లడించారు.ఈ సినిమాలను ఎన్నిసార్లు చూశానో తనకే తెలియదంటూ చెప్పుకొచ్చారు.ఇక ఆయన నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా సొసైటీకి ఎంతో మంచి మెసేజ్ అందించారని, ఇలాంటి సినిమాలు సొసైటీకి ఎంతో అవసరమని, ఇలాంటి సినిమాలు తప్పకుండా రావాలి అంటూ ఈ సందర్భంగా సముద్రఖని మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.