వృద్ధుడి దారుణ హత్య

సూర్యాపేట జిల్లా:మోతె మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.శుక్రవారం అర్ధరాత్రి గ్రామానికి జనార్దన్ రెడ్డి(60)ఆరుబయట మంచంలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలితో అత్యంత పాశవికంగా హత్య చేశారు.

 The Brutal Murder Of An Old Man-TeluguStop.com

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన పగడాల జనార్దన్ రెడ్డి (70) శుక్రవారం రాత్రి ఆరుబయట మంచం మీద నిద్రిస్తున్నారు.పక్కనే ఆయన మనవడు సూరకంటి ఉదయ్ రెడ్డి మరో మంచంపై పడుకున్నారు.

ఈ క్రమంలో అర్ధరాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి జనార్దన్ రెడ్డిపై కత్తులతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.అప్రమత్తమైన ఆయన మనవడు దాడిని అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతని చేతులకు గాయాలయ్యాయి.

నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.

మోతె ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు.నిందితులు ఎటువైపు పారిపోయారనే విషయాన్ని గ్రామస్థుల నుంచి ఆరా తీశారు.

సరిహద్దు జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు.భూవివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube