మహేష్ బాబు సినీ కెరీర్ లోని డిజాస్టర్లలో బ్రహ్మోత్సవం ఒకటనే సంగతి తెలిసిందే.బ్రహ్మోత్సవం సినిమా సీరియల్ ను తలపించిందని సినిమా చాలా దారుణంగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించాయి.
అయితే సర్కారు వారి పాట సినిమాలోని సెకండాఫ్ ను చూసిన ప్రేక్షకులు బ్రహ్మోత్సవం సినిమాతో పోలుస్తున్నారు.సినిమా చాలా రొటీన్ గా ఉందని సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు అస్సలు లేవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సర్కారు వారి పాట సినిమా గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్లు అభిమానులను సైతం హర్ట్ చేస్తున్నాయి.మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు.
మహేష్ హీరోగా తెరకెక్కిన సినిమా రెండున్నరేళ్ల తర్వాత విడుదల కాగా ఈ సినిమా నిరాశపరచటం అభిమానులను బాధిస్తోంది.భారీగా అంచనాలు పెట్టుకుని సినిమాకు వెళితే సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
మహేష్ లాంటి స్టార్ హీరో అవకాశం ఇస్తే దర్శకుడు పరశురామ్ సద్వినియోగం చేసుకోలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.కథల విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు ఓకే చెప్పి తప్పు చేశాడని మరి కొందరు భావిస్తున్నారు.భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాపైతే నిర్మాతలకు సైతం అంచనాలకు మించి నష్టాలు మిగులుతున్నాయనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటం డిస్ట్రిబ్యూటర్లను సైతం తెగ కలవరపెడుతోంది.
పెద్ద సినిమాలు విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వస్తుండటం వల్ల కూడా ప్రేక్షకులు ఎక్కువ మొత్తం చెల్లించి థియేటర్లలో సినిమాలను చూడటానికి ఆసక్తి చూపడం లేదు.ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాల్సి ఉంది.
రాబోయే రోజుల్లో విడుదలయ్యే పెద్ద సినిమాలైనా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.