ప్రముఖ ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కి భారీ షాక్ తగిలింది.ఈ టీమ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 2022 సీజన్ అంతటికీ దూరం అయ్యాడు.
ఈ చేదు వార్తను చెన్నై టీమ్ సీఈవో కాశీ విశ్వనాథన్ ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.రవీంద్ర జడేజా పక్కటెముకకు తీవ్ర గాయం అయిందని.
ఆదివారం నాడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అతను ఆడక పోవడానికి అదే కారణమని తెలిపారు.డాక్టర్ల సూచన మేరకు జడేజా ఈ సీజన్లోని మిగతా మ్యాచ్ల్లో ఆడడని వివరించారు.
ఐపీఎల్ 2022 చెన్నై టీమ్ కి కెప్టెన్ గా జడేజా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అతడి కెప్టెన్సీలో చెన్నై టీమ్ వరుసగా ఓడిపోతూ వస్తోంది.దీనితో జట్టు ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ ధోనీకే కట్టబెట్టింది.2022 సీజన్ లో 10 మ్యాచ్ల్లో జడేజా కేవలం 116 పరుగులు మాత్రమే చేసి అందర్నీ నిరాశపరిచాడు.లాస్ట్ మ్యాచ్ లలోనైనా తన మ్యాజిక్ చూపించి జట్టును ఛాంపియన్ గా నిలుపుతాడు ఏమోనని చాలామంది ఆశ పడ్డారు కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి.
జడేజా పది మ్యాచులు ఆడి బౌలింగ్లోనూ 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.పేలవమైన ప్రదర్శనతో జడేజా నిరాశ పరిచాడు కానీ మళ్లీ ఫ్యాన్స్ ను ఖుషి చేయడానికి ఆరోగ్యం సహకరించకుండా పోయింది.ఇక సీఎస్కే టీమ్ ప్రస్తుతం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.
ప్రస్తుతం ప్లేఆఫ్కు అర్హత సాధించాలంటే నెక్స్ట్ మ్యాచ్ లన్నీ గెలవాల్సి ఉంటుంది.