టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ రకుల్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా స్టార్ హీరోలందరి సరసన నటించిన విషయం తెలిసిందే.
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.టాలీవుడ్ లో సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు బిజీగా ఉండటంవల్ల హీరో మహేష్ బాబు సినిమాకు కూడా డేట్స్ ఇవ్వలేకపోయింది.
ఆ తర్వాత రెండు మూడు ఏళ్లలోనే తెలుగులో ఆమెకు ఆఫర్లు లేకుండా పోవడంతో రకుల్ బాలీవుడ్ కి చెక్కేసింది.బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడంతోనే రకుల్ ప్రీత్ సింగ్ అదృష్టం కొద్దీ ఆమె ఏకంగా అరడజను సినిమాల ఆఫర్లను అందుకుంది.
అయితే కరోనా వల్ల కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని వాయిదా పడుతూ వచ్చాయి.మరికొన్ని సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి.అయితే మొత్తానికి ఈ ఏడాది రకుల్ నటించిన ఆరు, ఏడు సినిమాలు విడుదల కానున్నాయి అని రకుల్ తాజాగా అధికారికంగా ప్రకటన చేసింది.సినిమాలు కూడా ఒక్కొకటి విడుదల అవుతున్నాయి.
ఇటీవలే జాన్ అబ్రహంతో నటించిన ఎటాక్ సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే.ఆ సినిమా పై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా విడుదల అనుకున్న విధంగా విజయం సాధించలేక పోయింది.
ఎటాక్ సినిమా నిరాశ పర్చడంతో ఆ తరువాత సినిమాలపై దృష్టిని పెట్టింది.కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తు బాలీవుడ్ లో రకుల్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఈమెకు అక్కడ స్టార్ డమ్ తెచ్చి పెడతాయనే నమ్మకం కలగడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోల సినిమాల్లో కూడా నటించిన రకుల్ ఎక్కువగా కమర్షియల్ పాత్రల్లో కనిపించింది.కనుక సినిమాలు సక్సెస్ అయినా ఈమె పాత్ర అక్కడి ప్రేక్షకుల్లో నోటెడ్ అయ్యేంతగా గుర్తింపు వస్తుందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆమె బాలీవుడ్ లో సందడి మూడు నాళ్ల ముచ్చటగానే మారే అవకాశాలు ఉన్నాయి అనేది మరి కొందరి అభిప్రాయం.అక్కడ ఆఫర్లు రాకుంటే మళ్లీ సౌత్ లో ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.
మరి మన టాలీవుడ్ వారు ఈమెను ఆధరిస్తారా లేదా అనేది చూడాలి మరి.