బిగ్ బాస్ కార్యక్రమం వివిధ భాషలలో ప్రసారం అవుతూప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ కార్యక్రమం తెలుగులో కూడా 5 సీజన్లను పూర్తిచేసుకునిప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రసారమవుతుంది.ఇక ఈ కార్యక్రమం మొదటి సీజన్ తో పోలిస్తే తర్వాత సీజన్లు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.
సరదాగా ప్రేక్షకులను సందడి చేయాల్సిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గొడవలు కాకుండా బూతు మాటలతో, డబుల్ మీనింగ్ డైలాగులతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పై వ్యతిరేకత ఏర్పడింది.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ పెద్దఎత్తున డిమాండ్లు వచ్చాయి.
ఇలాంటి ఒక చెత్త కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ సమాజానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంపై 2019 వ సంవత్సరంలో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే శుక్రవారం జగదీశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది శివప్రసాద్రెడ్డి జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయంపై అత్యవసర విచారణ జరపాలని సూచించారు.ఇలాంటి కార్యక్రమాలను ప్రచారం చేయటం వల్ల సమాజానికి మంచి చేయక పోవడమే కాకుండా యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంపై ఈ నెల 2వ తేదీన విచారణ జరుపుతామని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు.మరి ఈ కార్యక్రమం గురించిసోమవారం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.