సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసన దీక్షలో భాగంగా హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టేందుకు ఉరితాడుపై వ్రేలాడుతూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై మరెన్నో ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు.కేంద్రం దిగొచ్చే వరకు తగ్గేదేలే అంటూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.