దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.
ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.
దాదాపు 478 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పుకుంటున్నారు.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ కాబోతుంది.
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా భారీ ప్రమోషన్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఆర్ ఆర్ ఆర్ టీమ్.
ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి బెంగుళూరులోని చిక్కబళ్లాపూర్ లో గ్రాండ్ గా జరిగింది.
నిన్నంతా ఈ ఈవెంట్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఈ రోజు ప్రచారం చేయడానికి బడోరా లో అడుగు పెట్టింది.అక్కడ ప్రత్యేకమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర సందడి చేసారు.ఆ తర్వాత అక్కడ జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర రామ్ చరణ్, ఎన్టీఆర్ చేయి చేయి కలిపి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు.ఇంకో ఫొటోలో మధ్యలో రాజమౌళి కూడా ఉన్నాడు.