తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.నాన్ స్టాప్ అని చెప్పిన విధంగానే 24 గంటలు హాట్ స్టార్ లో ప్రసారం అవుతూనే ఉంది.17 మంది కంటెస్టెంట్ లతో 84 రోజుల పాటు ప్రసారం కానుంది.ఇక ఈ షో మొదలై వారం రోజులు కూడా కాకముందే అప్పుడే హౌస్ హీటెక్కింది.
కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, మాటల యుద్ధాలు మొదలయ్యాయి.అంతేకాకుండా మునుపెన్నడూ లేని విధంగా హౌస్ లో బూతులు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ కూడా టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ లకు బోల్డ్ ప్రశ్నలు వేస్తున్నాడు.ఇకపోతే ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ లో తొలివారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.
తొలివారం నామినేషన్స్ లో సరయు, నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్, అరియాన గ్లోరీ, మిత్రశర్మ, హమీద, ఆర్జె చైతూలు ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్నారు.ఇక ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది.
ఈ టాస్క్ లో తేజస్వి మదివాడ గెలిచి మొదటి కెప్టెన్ గా నిలిచింది.
ఆమె నటరాజ్ మాస్టర్ ను రేషన్ మేనేజర్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.మొదటి నుంచి ఎలా అయినా సరే కెప్టెన్ అవ్వాలి అనుకున్న బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి కనీసం కంటెండర్ గా కూడా పోటీ చేయలేకపోవడంతో బాధతో బోరున ఏడ్చేసింది.ఇక తొలి వారమే కెప్టెన్ గా నిలిచిన తేజస్వి బిగ్ బాస్ హౌస్ ను, హౌస్ మేట్స్ ను ఎలా దారిలో పెడుతుందో చూడాలి మరి.