ప్రభాస్ హీరో గా నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా రోజులైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మార్చి 11 వ తారీకున విడుదల కాబోతున్న రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ఈ సమయం లో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ గురించి తెగ చర్చ జరుగుతోంది.
క్లైమాక్స్ లో ఒక భారీ షిప్ సముద్రం లో మునిగి పోయే సన్నివేశం ఉంటుందని అంటున్నారు.అచ్చు టైటానిక్ లో మాదిరిగానే ఈ సన్నివేశాన్ని దర్శకుడు డిజైన్ చేశాడని ప్రచారం జరుగుతోంది.
టైటానిక్ క్లైమాక్స్ కి ఏమాత్రం తగ్గకుండా రాధేశ్యామ్ సినిమా లోని క్లైమాక్స్ ను డిజైన్ చేశారు అంటూ యూనిట్ సభ్యులు కొందరు చెబుతున్న నేపథ్యం లో దర్శకుడి వద్ద ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది.మీడియా వర్గాల వారు మరియు సోషల్ మీడియా జనాలు అడుగుతున్న ప్రశ్నలకు రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చాడు.టైటానిక్ సినిమా కు సంబంధించిన క్లైమాక్స్ తో రాధేశ్యామ్ సినిమా క్లైమాక్స్ కి ఏమాత్రం మ్యాచ్ కాదని రెండు విడి విడిగానే ఉంటాయి అని క్లారిటీ ఇచ్చాడు.టైటానిక్ సినిమా లో యాంటీ క్లైమాక్స్ ఉంటుంది కానీ రాధేశ్యామ్ మాత్రం అలా ఉండదు అంటూ దర్శకుడు రాధా కృష్ణ హామీ ఇచ్చాడు.
కచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం తో పాటు మంచి ఫీల్ గుడ్ మూవీ గా ప్రేక్షకులు థియేటర్ల నుండి బయటకు వచ్చేలా ఉంటుంది అంటూ నమ్మకం ను వ్యక్తం చేశాడు.దర్శకుడు రాధాకృష్ణ చేసిన ప్రకటన తో ఫ్యాన్స్ మరియు అన్ని వర్గాల ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.