స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.ఓవర్సీస్ లో ఈ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
ప్రభాస్, పూజా హెగ్డే మధ్య మనస్పర్ధలు ఉన్నాయని కొన్నిరోజుల క్రితం ప్రచారం జరిగినా తాజాగా వాళ్లిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులివ్వడంతో ఆ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే తేలిపోయింది.అయితే రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ప్రభాస్ మీడియాతో ముచ్చటించారు.
మీడియా అడిగిన ప్రశ్నలకు ప్రభాస్ తనదైన శైలిలో జవాబిచ్చారు.ఒక జర్నలిస్ట్ “నిజ జీవితంలో ప్రేమ విషయంలో మీ లెక్క తప్పిందా?” అని ప్రభాస్ ను ప్రశ్నించగా లవ్ విషయంలో తన అంచనాలు చాలా తప్పాయని అందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని ప్రభాస్ చెప్పుకొచ్చారు.తాను లవ్ ఫెయిల్యూర్ అని స్టార్ హీరో ప్రభాస్ చెప్పకనే చెప్పేశారు.వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో అని ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిన్న రాధేశ్యామ్ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ రిలీజైంది.ఇప్పటివరకు రాధేశ్యామ్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని భావించిన ప్రేక్షకులు సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని భావిస్తున్నారు.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ తో పోల్చి చూస్తే రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకుంది.రాధేశ్యామ్ కామన్ ఆడియన్స్ కు కూడా నచ్చేలా మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ మూవీకి దర్శకత్వం వహించారు.ప్రేమ, పెళ్లి గురించి ప్రభాస్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాల్సి ఉంది.యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తోంది.
నైజాంలో రాధేశ్యామ్ హక్కులు 70 కోట్ల రూపాయలకు అమ్ముడవగా నైజాంలో కూడా రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.