పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయినప్పటికీ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.
మొదటిరోజు సినిమా చూడాలని భావించే వాళ్లకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో భీమ్లా నాయక్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది.
నిన్న భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ సినిమా దర్శకుడు సాగర్ కె చంద్ర మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తన కుటుంబ సభ్యుల అండ వల్లే కల నెరవేరిందని ఈ దర్శకుడు చెప్పుకొచ్చారు.
పంజా సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కు వెళితే నన్ను తోసేశారని సాగర్ కె చంద్ర చెప్పుకొచ్చారు.అక్కడినుంచి ఈరోజు పవన్ సినిమాకు దర్శకత్వం వహించే స్థాయికి వచ్చానని సాగర్ కె చంద్ర కామెంట్లు చేశారు.
తన చుట్టూ ఉండే మంచి మనుషుల వల్లే తాను ఈ స్థాయికి రావడం సాధ్యమైందని సాగర్ కె చంద్ర వెల్లడించారు.దేవుడు ఎవరిలా బ్రతుకుతావని వరం ఇస్తే తాను రానాలా బ్రతుకుతానని ఏ పరిస్థితిలో అయినా రానా ఎనర్జీ ఒకే విధంగా ఉంటుందని సాగర్ కె చంద్ర కామెంట్లు చేశారు.భీమ్లా నాయక్ ప్రాజెక్ట్ లో తనకు ఛాన్స్ ఇచ్చినందుకు నాగవంశీకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని సాగర్ కె చంద్ర చెప్పుకొచ్చారు.
భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ బ్యాక్ బోన్ అని సాగర్ కె చంద్ర కామెంట్లు చేశారు.
అభిమానులు పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ అని పిలుస్తారని కానీ ఆయనకు ఆ పిలుపు నచ్చదని సాగర్ కె చంద్ర కామెంట్లు చేశారు.