టాలీవుడ్ స్టార్ హీరో లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే కచ్చితంగా వినిపించే పేర్ల లో పవన్ కళ్యాణ్ పేరు ముందు వరుస లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా టాక్ తో సంబంధం లేకుండా వందల కోట్ల వసూళ్ల ను రాబట్టుకోవడం ఈ మధ్య కాలం లో చాలా కామన్ విషయం అమైంది.
వకీల్ సాబ్ సినిమా మినిమం టాక్ ను సాధించినా కూడా వసూలు 100 కోట్లు దక్కించుకున్నాయి.ఈ సమయం లో అంతటి భారీ వసూళ్లు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఇక పవన్ కళ్యాన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విషయానికి వస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 110 కోట్ల వరకు చేసినట్లుగా సమాచారం అందుతోంది.
ఓన్లీ థియేట్రికల్ రైట్స్ ద్వారా 110 కోట్లు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.ఇది సౌత్ లోనే అతి కొద్ది మంది హీరోలకు మాత్రమే సాధ్యం అవుతుంది.పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఇది దక్కిందని అభిమానులు అంటున్నారు.
ఇక పవన్ కు ఏ మాత్రం తగ్గడు అంటూ తమిళ స్టార్ హీరో అజిత్ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.ఆయన అభిమానులు ఎప్పటికప్పుడు పవన్ కంటే ఒక అడుగు పైనే అజిత్ వుంటాడు అంటూ వ్యాక్యలు చేస్తూ ఉంటారు.
తమిళ అభిమానులు అజిత్ గొప్ప అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు.ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
అజిత్ నటించిన వాలిమై సినిమా 95 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లు చేయడం జరిగింది.కానీ పవన్ కళ్యాణ్ 110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో ఇది మా పవన్ కళ్యాణ్ స్థాయి అంటూ అభిమానులు ప్రచారం చేస్తున్నారు.
అజిత్ కంటే పవన్ ఎప్పుడూ కూడా ముందే పైనే ఉంటాడు.పవన్ సినిమాలు ఆయన రేంజ్ని చూపిస్తున్నాయి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అంటూ అభిమానులు ఫైటింగ్ చేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.