టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఆలియా భట్ సీత పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ లు,పాటలకు, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఆర్ఆర్ఆర్ సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేయడానికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.తాజాగా అప్డేట్ ప్రకారం మార్చి 1 నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి ఈ సినిమా విడుదల అయి ఉండేది.కానీ కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా విడుదల తేది మరొకసారి వాయిదా పడింది.జనవరి 7న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ మార్చి 25న డేట్ ఫిక్స్ చేశారు.రిలీజ్ డేట్ కి అనుగుణంగా ప్రమోషన్స్ ఈవెంట్ ను ప్లాన్ చేసుకుంటున్నారు రాజమౌళి అండ్ టీమ్.
ఈ నేపథ్యంలోనే తెలుగులో పెద్ద పెద్ద ఈవెంట్స్ నిర్వహించాలి అని అనుకుంటుండగా.అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మార్చి తొలి వారంలో ప్రకటించనుంది చిత్ర బృందం.ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.హీరో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు.
అలాగే ఇందులో శ్రియ, అజయ్ దేవ్గన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.