దేశంలోనే అత్యధిక నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కాగా దేశంలో ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఎలాగైనా యూపీ ఎన్నికలలో గెలవాలని ప్రధాన పార్టీలు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే యూపీలో కీలక పార్టీ సమాజ్ వాదీ.
పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.ఏడాదికి పైగా యూపీలో పలు ర్యాలీలు చేపడుతూ ఎన్నికల వేడి పెంచారు.
ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడటంతో తాజాగా యూపీ ప్రజలకు కొత్త హామీ ప్రకటించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే.
ఐదు సంవత్సరాల పాటు పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని ప్రకటించారు.అంత మాత్రమే కాక పేదల ఆరోగ్యం మెరుగుపడటానికి నెయ్యిని కూడా ఇస్తామని స్పష్టం చేశారు.
ఉచిత రేషన్ బిజెపి ఆపేయాలని నిర్ణయించింది అని.ఎన్నికల వరకు మాత్రమే ఉచిత రేషన్ అందుతాయని తర్వాత దానిని రద్దు చేస్తారని.అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.ఇందువల్లే ఇటీవల బడ్జెట్ లో.ఉచిత రేషన్ కి సంబంధించి నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అక్కడ యువతకు అధికారంలోకి వచ్చిన వెంటనే 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని.హామీ ఇచ్చారు.పేదలకు ఉచిత భోజనం అందేలా క్యాంటీన్ లు కూడా ఏర్పాటు చేస్తామని.
మరో హామీ ఇచ్చారు.కాగా ఇప్పుడు అధికారంలోకి వస్తే కొత్త హామీ ఉచిత రేషన్ ఇస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటించడం ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.