ఏపీ సీఎం వైఎస్ జగన్ మెగాస్టార్ చిరంజీవిని అవమానించారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.చిరంజీవి చేతులు ఎత్తి జగన్ కు నమస్కరిస్తూ ఏపీలో టికెట్ రేట్ల గురించి అభ్యర్థన చేయడంతో ఈ విధంగా ప్రచారం జరిగింది.
అయితే ప్రముఖ నటుడు అలీ ఈ ప్రచారం గురించి తాజాగా స్పందించారు.జగన్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులను, మెగాస్టార్ చిరంజీవిని అవమానించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం థియేటర్లలో టికెట్ల ధరలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండాలని భావిస్తోందని అలీ పేర్కొన్నారు.సీఎం జగన్ టాలీవుడ్ పెద్దలు కలిసిన సమయంలో ఇండస్ట్రీకి మేలు జరిగేలా చూస్తామని మాట ఇచ్చారని అలీ చెప్పుకొచ్చారు.
సీఎం జగన్ తనకో శుభవార్త ఉందని చెప్పారని అతి త్వరలో పార్టీ కార్యాలయం నుంచి శుభవార్తకు సంబంధించిన ప్రకటన వస్తుందని అన్నారని అలీ కామెంట్లు చేశారు.
అయితే ఆ శుభవార్త ఏమిటో తనకు తెలియదని అలీ చెప్పుకొచ్చారు.
రాజ్యసభకు ఛాన్స్ గురించి సీఎం జగన్ నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని అలీ చెప్పుకొచ్చారు.చిన్న సినిమాలకు కూడా లాభం ఉండాలని ఏపీ ప్రభుత్వ ఉద్దేశమని అలీ కామెంట్లు చేశారు.
తనకు పదవుల విషయంలో అసంతృప్తి ఎప్పుడూ లేదని అలీ అన్నారు.సినీ పరిశ్రమకు కావాలని ఇబ్బందులు ఎవరూ సృష్టించలేదని అలీ చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాజకీయాల గురించి నాకు తెలియదని 1999 నుంచి తను రాజకీయాల్లో ఉన్నానని అలీ పేర్కొన్నారు.తాను రాజకీయాల్లోకి వచ్చి 23 సంవత్సరాలు అయిందని అలీ పేర్కొన్నారు.అలీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అలీ ప్రస్తుతం పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు.పలు టీవీ షోలకు అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.