బాలీవుడ్ జంట అనుష్క, విరాట్ కోహ్లీ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ జంట వారి కెరిర్ పరంగా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ వారికీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తమ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే ఈ జంట జంతువులని చంపకుండానే మాంసం దందా నడిపిస్తున్నారు అంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.అసలు విషయం లోకి వెళితే… ముంబై కేంద్రంగా పనిచేసే స్టారప్ బూ ట్రైబ్ ఫుడ్స్ లో బాలీవుడ్ జంట అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ పెట్టుబడులు పెట్టారు.
బ్లూ ట్రైబ్ ఫుడ్స్ అనేది ఒక మాంసం ఉత్పత్తుల సంస్థ.
మాంసం ఉత్పత్తుల సంస్థ కానీ ఎటువంటి జంతువులను కూడా అక్కడ చంపేయరు, మూగజీవాలను హింసించకుండా మాంసం వచ్చేది ఎలా అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.తాజాగా శాస్త్రవేత్తలు అందుకు తగిన పద్ధతులను కూడా కొత్తగా కనిపెట్టారు.శాస్త్రవేత్తలు కనిపెట్టిన వాటి ఆధారంగా బ్లూ ట్రైబ్ ఫుడ్స్ అనేది మొక్కల నుంచి మాంసాన్ని రాబట్టి మార్కెట్లో అమ్మబోతోంది.
విరాట్,అనుష్క ఈ విషయంపై స్పందిస్తూ.మేము కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారం మాత్రమే తీసుకుంటున్నాం.
మాంసానికి పూర్తి దూరంగా ఉన్నాము అని తెలిపారు.
అంతే కాకుండా వారు మాంసాహారానికి దూరంగా ఉండడానికి గల కారణాలు కూడా వివరించారు.వారిద్దరు జంతు ప్రేమికులు కాబట్టి మాత్రమే మాంసాహారం మానేయలేదు.మాంసం తినడం వల్ల చుట్టూ ఉన్న ప్రపంచం పై ఎంతో ప్రభావం పడుతుంది.
ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని సార్లు మీ టేస్ట్ ను మిస్ అవుతూ ఉంటాం అని చెప్పుకొచ్చారు విరాట్ కోహ్లీ-అనుష్క.అయితే ఆ జంట వారు వ్యక్తిగతంగా జంతు మాంసం మానేయడమే కాకుండా ఇతరులు కూడా మానేయాలి అని ఆ జంట కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ముంబై కేంద్రంగా నడిచే ఒక వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టారు.
అక్కడ కొత్త టెక్నాలజీ ఉపయోగించి జంతువుల నుంచి కాకుండా మొక్కల నుంచి మాంసం ఉత్పత్తి చేస్తారు.దానివల్ల నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్ దొరుకుతుంది.అదే విధంగా జంతుహింస కూడా జరగకుండా ఉంటుంది.
ఇకపోతే అనుష్క ఆ విషయానికి వస్తే.విరాట్ కోహ్లీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పెళ్లి చేసుకున్న తర్వాత అనుష్క శర్మ పూర్తిగా నటనకు దూరం అయింది.ప్రస్తుతం అనుష్క శర్మ నటించడం లేదు.
తన భర్తతో కలసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది అనుష్క శర్మ.