అమ్మాయిలో మీద అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.ఎక్కడ అయినా సరే వారి మీద ఈ తరహా దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి.
మైనర్ ఏజ్ ఉన్న వారి నుంచి మొదలు కొంటే.వృద్ధులు కూడా అమ్మాయిల మీద దారుణాలకు ఒడిగట్టుతున్నారు.
ఇలాంటివి జరిగినప్పుడు వాట్సాప్ స్టేటస్లు పెట్టడం తప్ప పెద్దగా రియాక్షన్ అనేది ఏమీ కనిపించట్లేదు.అయితే ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నా కూడా.
నీచ బుద్ధిని వదులుకోవట్లేదు చాలామంది.ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
పాపం వృద్ధుడు కదా అని ఆర్టీసీ బస్సులో పక్కన కూర్చోబెడితే.అతనే ఆ బాలిక పట్ల కామాంధుడు అయ్యాడు.తాజాగా కడప నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ఇద్దరు దంపతులు తమ కూతురుతో కలిసి ఎక్కారు.అయితే సీటు లేదని తమ కూతురుని ఓ వృద్ధుడి పక్కన కూర్చోబెట్టారు.
అయితే కొంత సేపు ఏమీ అనని ఆ వృద్ధుడు.మెల్లిగా ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు.
ఇష్టం వచ్చినట్టు చేతులు వేస్తూ లైంగికంగా వేధించడం ఎక్కువ చేశాడు.దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పింది.
దీంతో వారు ఆ వృద్ధుడితో గొడవకు దిగారు.ఇక అప్పటికే ఆ బస్సు దుత్తలూర పోలీస్ స్టేషన్ సమీపంలోకి రావడంతో ఆ బస్సును ఆపి అతని మీద తల్లిదండ్రులు, ప్రయాణికులు కలిసి ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు.కాగా అతని మీద ఫోక్సో చట్టం కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.అందరూఆ వృద్ధుడి మీద దుమ్మెత్తి పోస్తున్నారు.
మనవరాలి వయసున్న అమ్మాయి మీద ఇలాంటి పని ఏంటంటూ కామెంట్లు పెడుతున్నారు.