స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మెయిన్ హీరోయిన్ రోల్ లో నటించే ఛాన్స్ వస్తే నో చెప్పడానికి స్టార్ హీరోయిన్లు అస్సలు ఇష్టపడరు.త్రివిక్రమ్ తన సినిమాలలో స్టార్ హీరోయిన్లను రిపీట్ చేస్తారని ఇండస్ట్రీలో భావిస్తారు.
త్రివిక్రమ్ గత రెండు సినిమాలలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.త్రివిక్రమ్ సినిమాలలో హీరోయిన్ పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది.
ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెయిన్ హీరోయిన్లు బాగానే క్లిక్ అవుతున్నా సెకండ్ హీరోయిన్ రోల్ లో నటించిన హీరోయిన్లకు మాత్రం ఆశించిన స్థాయిలో కెరీర్ పుంజుకోవడం లేదు.సినిమా సక్సెస్ సాధించినా సెకండ్ హీరోయిన్ గా నటించిన హీరోయిన్లు వరుసగా సినిమా ఆఫర్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నారు.
మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ ఉండగా ఈ రోల్ లో నటించే ఆఫర్ కు ఓకే చెప్పకూడదని కొంతమంది హీరోయిన్లు భావిస్తున్నట్టు బోగట్టా.
జల్సా సినిమాలో పార్వతీ మెల్టన్ సెకండ్ హీరోయిన్ రోల్ లో నటించగా ఈ సినిమా తర్వాత పార్వతి మెల్టన్ పలు సినిమాల్లో నటించినా ఆ సినిమాలు సక్సెస్ సాధించలేదు.
అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత సెకండ్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమా తర్వాత ప్రణీత నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యామీనన్, ఆదాశర్మ సెకండ్, థర్డ్ హీరోయిన్లుగా నటించగా ఈ హీరోయిన్లకు కూడా తర్వాత కాలంలో ఆఫర్లు తగ్గాయి.
అల వైకుంఠపురములో సినిమాలో నివేదా పేతురాజ్, అరవింద సమేత సినిమాలో ఈషా రెబ్బా, అజ్ఞాతవాసి సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, అఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించగా ఈ హీరోయిన్లలో ఎవరూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోలేదు.త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్లుగా నటించిన వాళ్లకు మంచి గుర్తింపు దక్కుతున్నా ఆ గుర్తింపు కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడటం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.