మే 27న విడుదలవుతున్న అడివి శేష్ ప్యాన్ ఇండియా మూవీ 'మేజర్'

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదలకు సిద్దంగా ఉంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.

 Adavi Sesh Major Movie Releasing On May 27 Details, Adavi Sesh ,major Movie ,rel-TeluguStop.com

శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు.మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

సినిమాను సరైన సమయంలో విడుదల చేస్తామని అడివి శేష్ ఇటీవల చెప్పారు.ఇప్పుడు అధికారికంగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు.వేసవి కానుకగా ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళ భాషలలో మే 27న విడుదల కాబోతోంది.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్కు విశేషమైన స్పందన వచ్చింది.

మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ హృదయమా అనే పాటకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కించారు.

ఇందులో మేజర్ సందీప్ బాల్యాన్ని, యవ్వనాన్ని చూపించనున్నారు.ముంబై అటాక్, మేజర్ వీర మరణం వంటి సన్నివేశాలన్నీ ఇందులో చూపించబోతోన్నారు.

శోభితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలను పోషించారు.మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube