రాజమౌళి మహేష్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన శ్రీలేఖ... కథ రాస్తుండగా కరెన్సీ నోట్లు అంటూ?

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు మనకు తెలిసిందే.

 Srilekha Gives Update About Rajamouli And Mahesh Movie Details,  Srilekha, Singe-TeluguStop.com

ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సినిమా కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు.వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వినబడుతున్నాయి ఇందులో విలన్ గా గోపీచంద్, హీరో విక్రమ్ వంటి వారి పేర్లు వినపడుతున్నాయి.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విజయేంద్ర ప్రసాద్ కు వరుసకు కూతురైన ప్రముఖ సంగీత దర్శకురాలు శ్రీలేఖ తాజాగా విజయేంద్ర ప్రసాద్ తో కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేశారు.

Telugu Gopichand, Mahesh Babu, Rajamouli, Srilekha, Tollywood, Vikram-Movie

ఈ ఫోటో ద్వారా మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చినట్లు కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇందులో టేబుల్ పై కథ రాయడం కోసం పెన్ను పేపరు అలాగే కరెన్సీ నోట్లు ఉండడంతో… ఈ విధంగా కథ రాస్తూ కరెన్సీ నోట్ల ద్వారా ఈ సినిమాకి సంబంధించిన క్లూ ఏదైనా ఇచ్చారా అంటూ కొందరు సందేహం వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube