స్టార్ యాంకర్ అనసూయ బుల్లితెర షోలతో బిజీగా ఉన్నా పెద్ద సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ విజయాలను అందుకుంటున్నారు.రంగస్థలం, పుష్ప సినిమాలలోని పాత్రలు అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.
పుష్ప ది రైజ్ తో పోలిస్తే పుష్ప ది రూల్ లో అనసూయ పాత్రకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఫిబ్రవరి నెల 11వ తేదీన విడుదల కానున్న ఖిలాడీ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సమాచారం.
అనసూయ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తారని సినిమాలో ఒక పాత్ర చనిపోతుందని సమాచారం. రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడీ సినిమాను కోనేరు హవీష్ నిర్మించారు.
రాక్షసుడు తర్వాత రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖిలాడీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం.ఏపీలో పెద్ద సినిమాల విడుదలకు అనుకూల పరిస్థితులు లేకపోయినా నిర్మాతలు చెప్పిన తేదీకే సినిమాను విడుదల చేస్తూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు.ఖిలాడీ మూవీ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరుగుతాయో లేదో చూడాల్సి ఉంది.
ఖిలాడీ మూవీ సక్సెస్ సాధిస్తే ఆ సక్సెస్ అనసూయ కెరీర్ కు కూడా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.కెరీర్ లో అనసూయ తొలిసారి డబుల్ రోల్ లో నటిస్తుండటంతో అనసూయ అభిమానులు కూడా ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.జబర్దస్త్ షోతో పాటు మరికొన్ని షోలతో అనసూయ బిజీగా ఉన్నారు.పలు ఈవెంట్లలో కూడా అనసూయ పాల్గొంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.