ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఈయన నటించిన మొట్ట మొదటి చిత్రం ద్వారా దేశ వ్యాప్తంగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సోషల్ మీడియాలో రోజు రోజుకు అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.పుష్ప సినిమా విడుదలై దాదాపు నెల రోజులు దాటిపోయిన ఇప్పటికీ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా పుష్ప మానియా నడుస్తోంది.
ఇలా పుష్ప సినిమా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అల్లుఅర్జున్ కు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఇప్పటివరకు సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకడిగా ఉంటూ ఏకంగా 15 మిలియన్ ఫాలోవర్స్ ని దక్కించుకున్న అల్లు అర్జున్ కేవలం పది రోజుల వ్యవధిలోనే మరొక మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకుని రికార్డు సృష్టించారు.
ఈ విధంగా 10 రోజులలోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ పెరగడంతో అల్లుఅర్జున్ ఇంస్టాగ్రామ్ లో ప్రస్తుతం 16 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకొని రికార్డులు సృష్టించారు.సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న పుష్ప రాజ్ త్వరలోనే 20 మిలియన్ ఫాలోవర్స్ ని దాటిపోయిన ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.ఇక పుష్ప సినిమా విజయవంతం కావడంతో త్వరలోనే పుష్ప పార్ట్ 2 చిత్రీకరణ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అల్లుఅర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే అల్లుఅర్జున్ దుబాయ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.