ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ హీరోగా నేను శైలజ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి తన కంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇక సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం ద్వారా ఏకంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి సురేష్ కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న అవమానాలు గురించి బయటపెట్టారు.
కెరియర్ మొదట్లో మలయాళ ఇండస్ట్రీలో ఈమె ఒక సినిమాలో నటించారు.అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.
ఆ సినిమా తరువాత మరో రెండు సినిమాలలో నటించినా అవి కూడా మధ్యలోనే ఆగిపోయాయి.ఇలా తాను నటించిన సినిమాలు ఆగిపోవడంతో చాలామంది నన్ను ఐరన్ లెగ్ అంటూ అవమానించారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా ఈ మాటలు తనను ఎంతో బాధ పెట్టాయని, కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్లానని తెలిపారు.
ఇలా తనకు మాత్రమే కాకుండా కెరియర్ మొదట్లో ఎంతో మంది ఇలాంటి అవమానాలను ఎదుర్కొన్నారని ప్రతి ఒక్కరూ ఇదే విధంగా బాధ పడి ఉంటారని తెలిపారు.ఈ ఐరన్ లెగ్ అనే ముద్ర నుంచి బయట పడటం కోసం నాకు సుమారు మూడు సంవత్సరాల టైం పట్టింది.అప్పుడు ఎవరైతే నన్ను ఐరన్ లెగ్ అని విమర్శించారో ఇప్పుడు వారు నా కంటికి కూడా కనిపించడం లేదని కీర్తి సురేష్ తనకు జరిగిన అవమానం గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు.
ఇక ప్రస్తుతం ఈమె మహేష్ బాబు సరసన సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలు పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.