తెలంగాణ బీజేపీ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడటానికి రకరకాల వ్యూహాలు పన్నుతూ ప్రయత్నిస్తోన్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పార్టీ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కొరకు ప్రయత్నిస్తున్న బీజేపీ క్షేత్ర స్థాయిలో బలపడటానికి పెద్ద ఎత్తున కార్యకర్తల నిర్మాణంపై దృష్టి పెడుతూనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచే విధంగా పావులు కదుపుతూ ఉన్న పరిస్థితి ఉంది.
అయితే కరీంనగర్ లో జీవో 317 అరెస్ట్ అంశాన్ని పెద్ద ఎత్తున రాజకీయంగా బీజేపీ కి అనుకూలంగా ఉపయోగించుకుందామని వ్యూహం పన్నినా ముందుగా ఈ విషయం లీక్ కావడంతో ఇక బండి సంజయ్ రెండు రోజులకే విడుదల అయ్యారు.
అయితే ఇక ఆ ఘటన తరువాత తాజాగా జరిగిన రాళ్ళ దాడి ఘటనకు సంబంధించిన అంశాన్ని బీజేపీ రాజకీయ పటిష్టతకు వినియోగించుకునే అవకాశం ఉంది.
నేడు బండి సంజయ్ నిజామాబాద్ లో పర్యటించి గాయపడ్డ కార్యకర్తలను పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ జిల్లా అధికార యంత్రాంగంపై మండిపడ్డారు.
తనపై దాడి జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకున్నారని జిల్లా కలెక్టర్, సీపీ ఈ ఘటనపై తక్షణమే స్పందించాలని ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసీఆర్ కనుసన్నల్లో అధికారులు నడుచుకుంటున్నారని భవిష్యత్ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని ఆ విషయాన్ని ప్రతి ఒక్క అధికారి గుర్తుపెట్టుకోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.అయితే ఇక ఈ దాడి అంశంతో ఇటు నిజామాబాద్ జిల్లాలో బీజేపీని బలోపేతం చేయడం మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం అట్టుడికేలా బీజేపీ కార్యాచరణను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.మరి బీజేపీ రానున్న రోజుల్లో ఎలా వ్యవహరిస్తుందనేది చూడాల్సి ఉంది.