ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమా ప్రారంభించాడు.కరోనా కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
మరి కొద్ది రోజులలో తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే విజయ్ దేవరకొండతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
లైగర్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమా విజయ్ దేవరకొండతో తీయనున్నట్లు సమాచారం.ఈ సినిమా ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగు పెట్టనుంది.
మహేష్ బాబు కోసం రెడీ చేసిన ఈ ప్రాజెక్ట్ మహేష్ బాబుకు కుదరక పోవడం వల్ల విజయ్ దేవరకొండతో కలిసి సినిమా తీయాలని పూరి జగన్నాథ్ అనుకుంటున్నాడు.మార్చి నుండి జనగణమన సినిమా పనులు ప్రారంభం కానున్నట్టు సమాచారం.
అయితే లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ బాలకృష్ణతో కలిసి నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు అన్న రూమర్స్ వినిపిస్తున్నాయి.
పూరి జగన్నాథ్ లైగర్ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్,గ్లిమ్ప్స్ అభిమానులలో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.ఈ సినిమాలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా ద్వారా ఆయన టాలీవుడ్ లో అడుగు పెట్టనున్నారు.పూరి జగన్నాథ్ ,ఛార్మి ఇద్దరూ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు సినిమా వర్గాల సమాచారం.