దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.
ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా ద్వారా ఈ ఇద్దరు హీరోలు మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించారు.
1920 బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమా ఫిక్షనల్ పిరియాడిక్ చిత్రం.చరిత్రలో ఎప్పుడూ కలుసుకొని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులను జక్కన్న ఈ సినిమా ద్వారా కలిపారు.
ఈ ఇద్దరూ స్వాతంత్ర సమరయోధులు కలుసుకొని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉంటుందని అలాంటి చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఎన్నో సార్లు వాయిదా పడింది.
ఇక జనవరి 7వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.అయితే రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వాయిదా పడక తప్పడం లేదు.
ఇక ఈ సినిమా గురించి ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ సినిమాలో రామ్ చరణ్ నటించిన అల్లూరి సీతారామరాజు పాత్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ నాకు అల్లూరి సీతారామరాజు ట్రైలర్ చూసినప్పుడు. చరణ్ నిప్పుల మధ్యనుంచి దూకుతూ బాణం సంధించే ఈ సన్నివేశం ఎంతో అద్భుతంగా నచ్చిందని.ఎంత బాగా అంటే ఆ పర్టికులర్ సన్నివేశంలో నేను నటిస్తే బాగుండేది అనిపించేంతగా ఆ సన్నివేశం నాకు నచ్చిందని తారక్ అల్లూరి సీతారామరాజు పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
ఇలా ఈ సినిమా గురించి ఎన్నో పోస్టర్లు ట్రైలర్ పాటలు విడుదల అయ్యి రోజురోజుకు సినిమాపై ఎన్నో అంచనాలు పెంచుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటికి ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమాని మార్చి 18 లేదా ఏప్రిల్ 28 వ తేదీలలో తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తాజాగా నిర్వాహకులు మరో సారి విడుదల తేదీలను ప్రకటించారు.ఈసారైనా అనుకున్న సమయానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో రాదో అనే సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఆలియా భట్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.అలాగే నటి శ్రియ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు.