రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యాలయంలో 73 వ గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకుని జాతీయ జెండాను కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీమతి మమత గారితో కలసి ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగుల కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.రాష్ట్రంలో జోనల్ విధానం పూర్తి అయ్యిందన్నారు.
నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు ఉద్యోగులు సంయమనం పాటించాలని సూచించారు.సీఎం కేసీఆర్ గారు ఉద్యోగుల పక్షపాతి గా అభివర్ణించారు.
ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణ ను రూపొందిస్తోందన్నారు మంత్రి శ్రీ.V.శ్రీనివాస్ గౌడ్ గారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి A.సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్, సహదేవ్, రవీందర్ రావు, అరుణ్ కుమార్, వెంకటయ్య, MB కృష్ణ యాదవ్, గండూరి వెంకట్, డా.హరికృష్ణ, లక్ష్మణ్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షులు కృష్ణ మూర్తి గౌడ్, లక్ష్మణ్ గౌడ్, సబిత, సుజాత తదితరులు పాల్గొన్నారు
.