నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వెండితెరపై అలాగే డిజిటల్ మీడియాలో కూడా దుమ్ము లేపుతున్నారు.అఖండ సినిమా ద్వారా వెండితెరపై సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు.
ఇలా ఎంతోమంది సినీ సెలబ్రిటీలను ఈ వేదికపై పలు రకాల ప్రశ్నలు అడుగుతూ నవ్వుల పువ్వులు పూయించిన బాలయ్య ఈ కార్యక్రమాన్ని విజయపథంలో తీసుకెళ్తున్నారు.
ఇక ఫిబ్రవరి 4వ తేదీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ ప్రసారం కావడంతో ఈ కార్యక్రమం మొదటి సీజన్ పూర్తి అవుతుంది.
ఈ విధంగా ఆహాలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ముందుగా వ్యాఖ్యాతగా అనుకున్నది బాలకృష్ణను కాదనే విషయం తాజాగా బయటపడింది.బాలయ్య కన్నా ముందుగా ఇద్దరు స్టార్ హీరోలను ఆహా సంప్రదించగా వారు నో చెప్పడంతో బాలయ్యను ఎంపిక చేసినట్లు సమాచారం.
బాలకృష్ణ కంటే ముందుగా నిర్వాహకులు విక్టరీ వెంకటేష్ ను ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాలని కోరారు.దీంతో ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించే అవకాశాన్ని వెంకటేష్ వదులుకున్నారు.వెంకటేష్ తర్వాత నాచురల్ స్టార్ నానిని కూడా ఆహా సంప్రదించినట్లు తెలుస్తోంది.అయితే బిగ్ బాస్ అనుభవం వల్ల,పలు సినిమా షూటింగులతో నాని బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి నో చెప్పారు.
ఇక ఈ ఇద్దరు హీరోలు నో చెప్పడంతో నిర్వాహకులు బాలయ్యను సంప్రదించి ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు.అయితే ఎవరూ ఊహించని విధంగా బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం విశేషం.