ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఆహారం లేకపోయినా కొన్నాళ్లు బతకవచ్చు.
కానీ, నీరు లేకుంటే మాత్రం మనుగడే లేదు.ఆరోగ్యంగా ఉండాలన్నా, అనేక జబ్బులకు దూరంగా ఉండాలన్నా రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు మనకు సూచిస్తుంటారు.
అయితే నీటిని తాగమన్నారు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందులోనూ ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు తిన్నాక నీళ్లను అస్సలు తాగరాదు.
పొరపాటున తాగారా ఇక అంతే సంగతులు.మరి ఇంతకీ ఏయే ఆహారాలు తీసుకున్నాక నీటిని తాగరాదో ఓ లుక్కేసేయండి.
చెరుకుగడ ప్రస్తుత సీజన్లో ఇది విరి విరిగా లభిస్తుంది.అద్భుతమైన రుచిని కలిగి ఉండే చెరుకుగడను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటుంటారు.
ఆరోగ్య పరంగానూ చెరుకుగడ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.అయితే చెరుకుగడ తిన్న గంట వరకు నీళ్లను అస్సలు తాగరాదు.
ఎందుకంటే, చెరుకుగడలో క్యాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
అందు వల్ల, చెరుకుగడ తిన్న వెంటనే వాటర్ తాగితే.ఆయా మినరల్స్ నీటితో రియాక్షన్ జరుపుతాయి.ఫలితంగా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, ఛాతిలో పట్టేయడం, స్టమక్ అల్సర్, మౌత్ అలర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చి పడతాయి.
కాబట్టి, ఇకపై ఎప్పుడూ చెరుకుగడ తిన్నాక నీటిని తీసుకోకండి.
అలాగే సలాడ్స్, నువ్వులు, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, స్వీట్స్, వేరు శనగలు వంటి ఆహారాలను తీసుకున్నాక కొందరు తెలిసో, తెలియకో నీటిని తాగుతారు.
కానీ, ఇలా చేడయం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు షుగర్ లెవల్స్ అదుపు తప్పే అవకాశాలు ఉంటాయి.అంతేకాదు, ఒక్కోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది.
అందు వల్ల, పైన చెప్పిన ఆహారాలు తీసుకున్నాక పొరపాటున కూడా నీటిని తాగవద్దు.