పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదల విషయంలో సస్పెన్స్ తేలి పోయింది.ఫిబ్రవరి 25వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే తేదీని ప్రకటించారు.
కాని సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగింది.కరోనా థర్డ్ వేవ్ ఉండటం వల్ల సినిమా విడుదల విషయంలో స్పష్టత కరువయ్యింది.
కనుక సినిమా విడుదల విషయంలో నెలకొన్న గందరగోళంకు చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.భీమ్లా నాయక్ ను ఇటీవల ప్రకటించినట్లుగా ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నారట.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటించారు.సినిమా విడుదలకు గాను ఓవర్సీస్ బయ్యర్లు కూడా సిద్దం అవుతున్నారు.
ఫిబ్రవరి 24వ తారీకున సినిమా ప్రీమియర్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.అమెరికా తో పాటు పలు దేశాల్లో ఈ సినిమా ప్రీమియర్ లు ఉండబోతున్నట్లుగా ప్రకటించారు.
భీమ్లా నాయక్ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి నెలలు గడుస్తుంది.కాని కరోనా వల్ల వాయిదా పడింది.త్రివిక్రమ్ రచన మరియు స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా కు గాను సాగర్ చంద్ర దర్శకత్వం వహించాడు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే.
అయ్యప్పనుమ్ కోషియుమ్ కు ఇది రీమేక్ అయినా కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి మరియు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసినట్లుగా ప్రకటించారు.భీమ్లా నాయక్ సినిమా చిత్రీకరణ సమయంలోనే కరోనా బారిన పవన్ పడ్డాడు.అందువల్ల కూడా సినిమా ఆలస్యం అయ్యింది.నిత్యా మీనన్ ఈ సినిమా లో పవన్ కు జోడీగా నటించిన విషయం తెల్సిందే.ఫిబ్రవరి 25న ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.దిల్ రాజు ఈ సినిమా కు మరే పోటీ లేకపోవడం వల్ల భారీ ఎత్తున విడుదల చేస్తారేమో చూడాలి.