రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా ఫిబ్రవరి 11న విడుదల కాబోతుంది.కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు భావించారు.
కాని ఆ డేట్ కంటే మరే డేట్ సరైనది కాదు అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే ఖిలాడి సినిమా ను విడుదల చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద ఆంక్షలు ఉంటాయని భావించారు.ఏపీలో కాస్త హడావుడి ఉన్నా తెలంగాణలో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు.
ఏపీలో కూడా థియేటర్ల వద్ద గతంలో మాదిరిగా సీరియస్ ఆంక్షలు లేవు.అవి వచ్చే నెలలో తొలగించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
అందుకే ఖిలాడి సినిమాను విడుదల చేసేయాలని భావిస్తున్నారట.
ఒక వేళ ఇప్పుడు విడుదల కనుక వాయిదా వేస్తే మరో మూడు నాలుగు నెలల వరకు కనీసం సమయం లభించే అవకాశం లేదు.
కనక రవితేజ మరియు రమేష్ వర్మల కాంబోలో సినిమా ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.రవితేజ క్రాక్ సినిమా తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.కనుక ఈ సినిమా తో ఆయన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లు దక్కించుకునేలా మంచి టైమ్ లో సినిమా ను విడుదల చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాని ఖిలాడి సినిమా విడుదల వాయిదా వేసే ఆలోచన మానుకోక పోవడంతో ఆంక్షల మద్య విడుదల కాబోతుంది.కనుక ఆ స్థాయి వసూళ్లు సాధ్యమా అంటూ ఇప్పుడు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరుగుతుందో చూడాలంటే ఫిబ్రవరి 11 వరకు వెయిట్ చేయాల్సిందే.