టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై విమర్శల వర్షం కురిపించారు.జగన్ దుర్మార్గ పాలనకు పోలీసుల దౌర్జన్యం తోడైందని.
సీరియస్ వ్యాఖ్యలు చేశారు.టీడీపీ నేత బుద్ధ వెంకన్న అరెస్టును ఖండించారు.
సమాజంలో అల్లర్లు సృష్టిస్తున్న వైసీపీ నాయకులను వదిలేసి తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పోలీసులు నెత్తిమీద మూడు సింహాలకు బదులు మూడు ఫ్యాన్ రెక్కలు పెట్టుకోండి అంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కొడాలి నాని మరికొంత మంది వైసీపీ నేతలు… తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.ఇటువంటి నాయకులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ?, మూడు సంవత్సరాలలో ఎంత మంది వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.? అంటూ యనమల రామకృష్ణుడు ప్రశ్నల వర్షం కురిపించారు.సీఎం జగన్ మాట విని డీజీపీ మరికొంత మంది పోలీసులు తమ భవిష్యత్.
వారే అంధకారం లోకి నెట్టుకుంటున్నారని అన్నారు.ఏది ఏమైనా బుద్ధ వెంకన్న అరెస్ట్ అక్రమం.
వెంటనే ఆయనను విడుదల చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.