టాలీవుడ్ హీరో బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే.ఇప్పటివరకూ వెండితెరపై సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణ, ప్రస్తుతం బుల్లి తెరపై హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు.
ఇకపోతే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పాడు అంటే అభిమానుల నుంచి ఒక రేంజ్ లో అరుపులు వినిపిస్తూ ఉంటాయి.ఇక అదే రేంజ్ లో బాలయ్య మాట్లాడిన మాటలను ట్రోలింగ్ చేయడానికి కూడా కొంతమంది రెడీగా ఉంటారు.
ఈ నేపథ్యంలోనే అలాంటి వారు బాలయ్య టాక్ షో నిర్వహిస్తున్న సమయంలో ఇక విపరీతంగా ట్రోల్ చేయొచ్చు అని అనుకున్నారు.కానీ అలాంటి వారి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాడు బాలయ్య.
ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ షోలో తనదైన శైలిలో హోస్ట్ గా వ్యవహరిస్తూ షో కి వచ్చే సెలబ్రిటీలను, అలాగే ప్రేక్షకులను తనదైన శైలిలో పలకరిస్తూ అలరిస్తున్నాడు ఈ షో గురించి కేవలం తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా మాట్లాడుకునే తట్టుగా చేశారు బాలయ్య బాబు.
బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఇంటర్నేషనల్ రేంజ్ లో అరుదైన ఘనతను కూడా దక్కించుకుంది.
ఇకపోతే ఈషో మొదటి సీజన్ ఫిబ్రవరి 4న ప్రసారం కాబోయే మహేష్ బాబు ఎపిసోడ్ తో ముగియనుంది.ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కీ 4.3 మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా ట్రెండింగ్ నెంబర్ వన్ గా కూడా నిలిచింది.కేవలం మొదటి సీజన్ కీ మాత్రమే కాకుండా ఆ తర్వాత సీజన్లకు కూడా పోస్ట్ గా బాలకృష్ణ ఉండాలి బాలకృష్ణ లేకుండా ఊహించుకోవడమే కష్టం అనేటట్టుగా చేసేసారు బాలకృష్ణ.
ఇప్పటికే మొదటి సీజన్ లో పలువురు సెలబ్రెటీలు వచ్చి సందడి సందడి చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ సీజన్ 2 కి మెగాస్టార్ గెస్ట్ గా రాబోతున్నారు.నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి లను ఒకే స్టేజి లో చూడబోతున్నారు ప్రేక్షకులు.
ఇదే విషయాన్ని అన్ స్థాపబుల్ రైటర్ బి.వి.ఎస్.రవి అలియాస్ మచ్చ రవి లీక్ చేశాడు.ఇక సీజన్ 2 గెస్ట్ గా మెగాస్టార్ ని సంప్రదించగా అందుకు మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలిపారు.ఒకవేళ ఇదే గనుక నిజమైతే బాలయ్య, చిరు అభిమానులకు పండగే పండగ అని చెప్పవచ్చు.