మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల మొక్కలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు.ఈ క్రమంలోనే మొక్కలను దైవస్వరూపంగా భావించి వాటిని పూజించడం లేదా వాటిని ఎంతో పవిత్రంగా భావించడం చేస్తుంటాము.
ఇలా పవిత్రంగా భావించే వాటిలో తెల్ల జిల్లేడు చెట్టు ఎంతో ముఖ్యమైనదిగా చెబుతారు.తెల్ల జిల్లేడు చెట్టులో సాక్షాత్తు గణపతి కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా తెల్ల జిల్లేడు పువ్వులతో పరమేశ్వరునికి పూజ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పవచ్చు.
తెల్ల జిల్లేడు చెట్టు ఎన్నో ప్రాముఖ్యతను కలిగి ఉంది.
ముఖ్యంగా మన ఇంటి పై ఏ విధమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా తెల్ల జిల్లేడు చెట్టు మనల్ని రక్షిస్తుంది.ఈ క్రమంలోనే మన ఇంటి పై ఉన్న చెడు ప్రభావం తొలగిపోవాలంటే రావిపుష్య యోగంలో ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా తెల్ల జిల్లేడు చెట్టు నాటాలి.
ఇలా చేయటం వల్ల మన ఇంటి పై ఎవరైనా చేసిన చెడు ప్రయోగాలు చేసినా, దుష్టశక్తుల ప్రభావాన్ని తరిమికొడుతుంది.
అదేవిధంగా మరి ఇంట్లో ఏ వ్యక్తి అయినా తాంత్రిక చర్యలకు గురైతే అలాంటి వారికి తెల్లజిల్లేడు వేరు ముక్కను వారి నడుముకు కట్టడంవల్ల వారిపై ప్రయత్నించిన ఈ తాంత్రిక చర్య ప్రభావం చూపదు.ఇలా తెల్ల జిల్లేడు చెట్టు మన ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల దుష్టశక్తుల ప్రభావం మన ఇంటి పై పడటమే కాకుండా మన ఇంట్లో అనుకూల వాతావరణాన్ని కల్పించే అదృష్టాన్ని తీసుకువస్తుందని చెప్పవచ్చు.