ఒంట్లో సరిపడా రక్తం లేకపోవడమే రక్తహీనత.ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు.
ఐరన్, విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు లోపించడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, మద్యపానం అలవాటు, విష జ్వరాలు సోకడం, ప్రెగ్నెన్సీ వంటివి రక్తహీనతకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.కారణం ఏదైనప్పటికీ రక్త హీనత సమస్యను నివారించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయి గుండె, మెదడు, లివర్ మరియు ఇతర అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
అందుకే ఆరోగ్య నిపుణులు సైతం రక్త హీనత ఉంటే దాన్ని వెంటనే తగ్గించుకోవాలని సూచిస్తుంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే సూపర్ అండ్ సింపుల్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం రక్త హీనతను తరిమికొట్టే ఆ డ్రింక్ ఏంటో.? ఎలా తయారు చేసుకోవాలి.? చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ పాలు పోయాలి.
పాలు కాస్త వేడి అవ్వగానే అందులో ఒక టేబుల్ స్పూన్ ఫూల్ మఖానా (తామర గింజలు) పొడి, పావు టీ స్పూన్ గసగసాల పొడి వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి.చివరిగా ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని గ్లాస్లో పోసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ సిద్ధమైనట్టే.
ఈ పాలను ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే గనుక అందులో ఉండే పోషకాలు ఎర్ర రక్త కణాలను పెంపొందించి రక్త హీనత సమస్యను నివారిస్తాయి.అలాగే ఈ పాలను తాగడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు దూరం అవుతాయి.ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి.మరియు అధిక ఆకలి సమస్య సైతం తగ్గు ముఖం పడుతుంది.