టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో విలన్ గా మారి పలు సినిమాలలో నటించి అనంతరం కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ తాజాగా బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ద్వారా వరద రాజులు అనే విలన్ పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీకాంత్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.నేను వరదరాజులు అనే విలన్ పాత్రలో నటించడం చాలా మంది ప్రేక్షకులు ఇష్టపడటం లేదనే విషయాన్ని తెలిపారు.
ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేశారు.
వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో నా పాత్రను చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారని అసలు ఇక్కడ శ్రీకాంతేనా? అనే విధంగా తన పాత్ర ఉండబోతుందని ఈ సందర్భంగా శ్రీకాంత్ రామ్ చరణ్, శంకర్ సినిమాలో తన పాత్ర గురించి తెలిపారు.మరి ఈ పాత్ర ద్వారా శ్రీకాంత్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.