మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో క్యాసినో రాయల్ తరహాలో గోవా కల్చర్ తీసుకొస్తున్నట్లు పేకాట క్లబ్ లు.నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఇటీవల ఆరోపణలు చేయడం తెలిసిందే.
అంత మాత్రమే కాక చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు గుడివాడ నియోజకవర్గం లోకి వెళ్ళడానికి పేకాట క్లబ్ లు పరిశీలించడానికి.ప్రయత్నాలు చేయగా వైసిపి శ్రేణులకు తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య తోపులాట జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
గుడివాడ ఘటనకు సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీ పై మండిపడ్డారు.
అసలు తెలుగుదేశం పార్టీకి నిజనిర్ధారణ కమిటీ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.అసలు తెలుగుదేశం పార్టీలో నిజం మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా.? గుడివాడలో ప్రశాంత వాతావరణం చెడగొట్టడానికి కొడాలి నాని పై వ్యక్తిగత కక్ష ఉన్నవాళ్లు నిన్న గుడివాడలో హడావిడి చేశారు అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.లా అండ్ ఆర్డర్ విషయంలో శాంతిభద్రతలకు సమస్య గా మారితే చంద్రబాబు నైనా సరే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
లోకేష్ కు కరోనా వచ్చింది అని.చంద్రబాబుకి కరోనా వచ్చినా… రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.రాష్ట్రానికి పట్టిన అతి పెద్ద కరోనా చంద్రబాబు అంటూ.మంత్రి వెల్లంపల్లి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.