ఈ మధ్య దేశంలో ఆడ వారి మీద అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.అమ్మాయి ఒంటరిగా వెళ్లినా లేదంటే జంటగా వెళ్లినా సరే వారి మీద దారుణంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు.
ఇప్పుడు కూడా ఓ అమ్మాయి ఇలాగే తన ప్రియుడితో కలిసి బయటకు వెళ్తే దారుణం జరిగిపోయింది.ఈ మధ్య ఇలా ఒంటరిగా బయటకు వెళ్తున్న ప్రేమికులను టార్గెట్ గా చేసుకుని ఇలా దారుణాలకు ఒడిగడుతున్నారు దుర్మార్గులు.
పీలేరు ఏరియాలో నివసిస్తున్న ఓ యువతి.స్థానికంగా ఉన్న కాలేజీలో డిగ్రీ చదువుతోంది.అయితే తన క్లాస్ మేట్ తో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది.వీరు ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఔటింగ్ కు వెళ్లారు.
ఇక అలవాటులో భాగంగా వారిద్దరూ రీసెంట్ గా బయటకు వెళ్లారు.అయితే అదును చూసి కొందరు దుర్మార్గులు బాగా మద్యం తాగి వారి వద్దకు వచ్చారు.
ఏకాంతంగా ఉన్న వారి వీడియోలను చిత్రీకరించి, వారిని బెదిరించారు.తమకు వైన్ తీసుకు రావాలని లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు.
ఇక అబ్బాయి భయపడిపోయి వైన్ తీసుకు రావడానికి వెళ్లాడు.అయితే అతను వెళ్లగానే ఆ మందుబాబులు అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.అయితే అబ్బాయి వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.ఒక వారం తర్వాత ఆ అమ్మాయి సూసైడ్ అటెమ్ట్ చేసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేయడంతో.తల్లిదండ్రులు అలాంటిదేమీ వద్దని, తమను వదిలేయాలంటూ వేడుకున్నారు.
అయితే స్థానికంగా ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.అయితే పోలీసులు మాత్రం ఈ కేసును ఇంకా సీక్రెట్ గానే విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలవరం రేపుతోంది.