టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆర్సి15.
ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.ఈ సినిమాను దర్శకుడు శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర అప్డేట్లను చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ నెలలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకున్నారు చిత్రబృందం.ఇటీవలే ముంబైలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే.
కాగా మరొక షెడ్యూల్ కోసం ఏర్పాటు చేస్తున్నారు చిత్రబృందం.ఈ షెడ్యూల్ లో భాగంగా సినిమాలోని హీరో హీరోయిన్ ల పాటను చిత్రీకరించనున్నారు.
ఈ పాటకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పని చేస్తున్నారు.ఇదిలా ఉంటే మామూలుగా దర్శకుడు శంకర్ సినిమాలో పాటలకు భారీగా హంగులు ఉంటాయి అన్న విషయం తెలిసిందే.
అదేవిధంగా శంకర్ తెరకెక్కించే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి అని చెప్పవచ్చు.ఇకపోతే శంకర్ తాజాగా చిత్రీకరించనున్న షెడ్యూల్ విషయానికి వస్తే, ఈ షెడ్యుల్ లో పాటకోసం హాలీవుడ్ టెక్నీషియన్లు, డాన్సర్లు పనిచేయనున్నారు ఈ పాట కోసం ఏకంగా 23 కోట్ల బడ్జెట్ ను పెట్టుబడిగా పెడుతున్నారు.23 కోట్ల భారీ బడ్జెట్ తో సెట్ ను నిర్మించి అందులో ఒక పాట తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వార్త విన్న చెర్రీ అభిమానులు ఈ సినిమాపై మరింత అంచనాలు పెట్టుకున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో వార్త కూడా వైరల్ అవుతోంది.
ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ను జీ స్టూడియో 200 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇది భారీ డీల్ అంటూ ఫిల్మ్నగర్లో టాక్ వినిపిస్తోంది.