కరోనా విధ్వంసం సృష్టిస్తున్న వేళ దీని ప్రభావం అన్నింటిపై పడుతుంది.ఇప్పుడు కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది.
తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొత్త వేరియంట్ తో స్ట్రాంగ్ గా మన ముందుకు వచ్చింది.రోజురోజుకూ కేసులు మరింత పెరుగు తున్నాయి.
కరోనా తోనే నానా అవస్థలు పడుతున్న ప్రజలకు మరోవైపు నిత్యావసర ధరలు కూడా చుక్కులు చూపిస్తున్నాయి.
దీంతో ప్రజలు తమ అభిరుచులను, అలవాట్లను సైతం పక్కన పెట్టెలా చేసింది.
ఇలాంటి తరుణంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు అంటూ వాటికీ పెట్టే ఖర్చు మరింత భారం అవుతుంది.ఈ విషయంలో మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చిన్న ఫంక్షన్ కు వేలలో ఖర్చు అవుతున్న ఈ రోజుల్లో ఇక పెళ్లిళ్ల కు అయితే చెప్పాల్సిన పని లేదు.ఈ ఖర్చులు తలచుకుని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాపోతున్నారు.
ముఖ్యంగా ముస్లిం ల ఇంట్లో పెళ్లి అంటే ఆర్ధికంగా భారం అంటున్నారు.పెళ్లిళ్లకు ఎక్కువుగా ఖర్చు చేయడంతో వివాహ విందు ఖర్చు బాగా పెరిగిపోతుందని ఆడపిల్లల కుటుంబాలు చెబుతున్నాయి.దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఆ జిల్లాలోని వేములవాడ పట్టణంలో ఇక నుండి ఎవరి పెళ్లికైనా ఒకే కూర, ఒకే స్వీట్ ఉండాలని తీర్మానం చేసారు.
ముస్లిం పెళ్ళిలో విందు భోజనం అంటే ఎలా ఉంటుందో మన అందరికి తెలుసు.కరోనా తర్వాత ఆర్ధిక స్థితి మారిపోవడంతో ఖర్చులు భరించలేక పోతున్నారు.
ఈ క్రమంలో ఆడపిల్లల కుటుంబాలు కట్న కానుకలతో పాటు విందు భోజనం కూడా పెట్టడం కష్టం అవుతుంది అని ఫిర్యాదు చేసారు.దీంతో మత పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు.